తెలంగాణలో వచ్చే 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని, ఉ.11 నుంచి సా.4 వరకు బయటకు రావొద్దని సూచించింది. NLG, WGL, KNR, PDPL, JGL వనపర్తి, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటినట్లు పేర్కొంది. ఆదివారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.