ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారుల్లో సికిల్ హిమోగ్లోబిన్ డి-పంజాబ్ అనే అరుదైన వ్యాధిని వైద్యులు గుర్తించారు. దీనిపై గుంటూరు సర్వజనాసుపత్రి పెథాలజీ విభాగం అధిపతి అపర్ణ మాట్లాడుతూ ఇది పంజాబ్ రాష్ట్రంలో మాత్రమే వచ్చే అరుదైన వ్యాధి. ఈ వ్యాధి గుర్తించిన ప్రాంతంలో నివసిస్తున్న పిల్లలందరికీ రక్త పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.