ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో విలన్గా యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసినట్లు టాక్ నడుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర, వార్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్-2 తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇవి పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని సమాచారం.