NEETపై సుప్రీంకోర్టు విచారణ చేయాలి: కపిల్ సిబల్

57చూసినవారు
NEETపై సుప్రీంకోర్టు విచారణ చేయాలి: కపిల్ సిబల్
వైద్య ప్రవేశ పరీక్ష NEETపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరగాలని ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఆదివారం దీనిపై జాతీయ మీడియాతో మాట్లాడారు. NEET పరీక్షలో అవకతవకలు ఎలా జరిగాయో అన్ని రాష్ట్రాలతో సమగ్ర సంప్రదింపులు జరపాలన్నారు. NEET పరీక్ష ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఉండడం సరికాదని పేర్కొన్నారు. పార్లమెంటులో దీనిపై చర్చించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్