బాయిలర్ పేలుడు ఘటన.. ఫ్యాక్టరీ యజమానురాలు అరెస్ట్‌!

70చూసినవారు
బాయిలర్ పేలుడు ఘటన.. ఫ్యాక్టరీ యజమానురాలు అరెస్ట్‌!
మహారాష్ట్రలోని థానే పట్టణంలోగల డోంబివిలీ ఏరియాలో ‘అముదన్‌ కెమికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ’ బాయిలర్‌లో గురువారం జరిగిన పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికే 11 కు చేరింది. మరో 60 మందికిపైగా గాయాలపాలై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనా ప్రాంతంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పరారీలో ఉన్న మాలతీ ప్రదీప్‌ మెహతా (70) ను ఇవాళ నాసిక్‌లో అరెస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్