పోలవరం పునరావాస బాధితుడి ఆత్మహత్యాయత్నం

69చూసినవారు
పోలవరం పునరావాస బాధితుడి ఆత్మహత్యాయత్నం
AP: పరిహారం అంద‌లేద‌ని పోలవరం పునరావాస బాధితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డ్డాడు. అల్లూరి జిల్లా దేవీపట్నానికి చెందిన ఉండమట్ల సీతారామయ్య అనే రైతు.. త‌న‌కు పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ఇవ్వలేదంటూ ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద పురుగుల మందు తాగాడు. బాధితుడిని సిబ్బంది రాజ‌మండ్రి ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్