పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ శాతాల వివరాలను వెబ్సైట్లో ప్రచురించడం వల్ల ఎన్నికల యంత్రాంగం గందరగోళంలో పడుతుందని ఈసీ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి అఫిడవిట్ దాఖలు చేసింది. పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే కేంద్రాలవారి ఓటింగ్ శాతాలను ఈసీ వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.