ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బిఒఎం) కేంద్ర ప్రభుత్వానికి రూ.857 కోట్ల డివిడెండ్ను ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం 2023ా24గాను ఆ మొత్తానికి విలువ చేసే చెక్కును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు బిఒఎం ఎండి, సిఇఒ నిధు సక్సేనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశీష్ పాండే అందజేశారు. ప్రతీ ఈక్వీటీ షేర్పై 14 శాతం డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది.