ఉప్పల్ వేదికగా హైదరాబాద్, చెన్నై జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్లో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సందడి చేశారు. ఎస్ఆర్హెచ్– సీఎస్కే మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బ్రహ్మానందంను చూసిన క్రికెట్ అభిమానులు బ్రహ్మి.. బ్రహ్మి అంటూ కేరింతలు కొడుతున్నారు. అలాగే, సీఎం రేవంత్, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, వెంకటేశ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మ్యాచ్ను తిలకిస్తున్నారు.