భారత మాజీ రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఢిల్లీ కోర్టు మంగళవారం షాక్ ఇచ్చింది. మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన క్రిమినల్ కేసులో లైంగిక వేధింపులు, బెదిరింపులతో కూడిన అభియోగాలను ఆయనపై నమోదు చేసింది. ఈ కేసులో సహ నిందితుడు, మాజీ డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్పై క్రిమినల్ బెదిరింపు అభియోగాన్ని కూడా కోర్టు నమోదు చేసింది.