త్తరప్రదేశ్లోని కైసర్గంజ్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి కరణ్ భూషణ్ సింగ్ నామినేషన్ దాఖలు చేశారు. పలువురు పార్టీ నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లిన ఆయన నానిమేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది తన జీవితంలోనే అతిపెద్ద క్షణాల్లో ఒకటని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కైసర్గంజ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనను ఆశీర్వదించండి అంటూ వేడుకున్నారు.