'కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి'

29725చూసినవారు
'కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి'
లోక్ సభ ఎన్నికల తర్వాత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని మెదక్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. సోమవారం ఆయన దుబ్బాకలో కిసాన్ మోర్చా సమ్మేళనంలో మాట్లాడారు. ఈ నియోజకవర్గంపై కొత్త ప్రభాకర్ రెడ్డికి అవగాహన లేదన్నారు. ఆయనకు డబ్బులు పెట్టి ఓట్లు కొనడం మాత్రమే తెలుసు అని విమర్శించారు. కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని రఘునందన్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్