ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం గ్రేటర్ హైదరాబాద్ అంతటా బీఆర్ఎస్ ధర్నాలకు పిలుపునిచ్చింది. అమీర్పేట మైత్రివనం దగ్గర తలసాని సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్తోపాటు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు సిటీ లీడర్లు ధర్నా చేపట్టారు.