ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్ లో ఎవరూ ఉండరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'కేసీఆర్కు అధికారం పోయిందని దుఃఖం వచ్చింది. ఆయనకు తెలంగాణ ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదు. చేపలు, గొర్రెల పంపిణీ పేరిట రూ.వేల కోట్లు తిన్నారు. కేసీఆర్కు మంత్రి పదవి రాలేదనే తెలంగాణ ఉద్యమం చేపట్టారు. ఉద్యమం సమయంలో అమాయకులను రెచ్చగొట్టి చంపారు' అని విమర్శించారు.