నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు రాజ్భవన్ను ముట్టడించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు నిరసనగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాజ్భవన్ను ముట్టడించారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు.. అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.