బస్సులో సీటు కోసం, రైలులో సీటు కోసం కొట్టుకోవడం మనకు సాధారణంగా కనిపించే విషయమే. ఎక్కువగా చాలా మంది సీటు నాదంటే నాది అని వాదులాడుకుంటారు. కానీ మరీ దారుణంగా ఇద్దరు యువతులు, ఒక యువకుడు అందరి ముందు దారుణంగా కొట్టుకున్నారు. ఈ సంఘటన హౌరా-అజీమ్గంజ్ మధ్య నడిచే కవిగురు ఎక్స్ప్రెస్ రైలులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో యువకుడిపై ఇద్దరు యువతులు దాడి చేయగా, యువకుడు సైతం వారిని తీవ్రంగా కొట్టాడు.