కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం (వీడియో)

65చూసినవారు
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెన్నూరు సమీపంలోని బాబూసాపాల్యలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద పడి ముగ్గురు మరణించినట్టు అధికారులు తెలిపారు. మరో 16 మంది కార్మికులు చిక్కుకుపోయి ఉండవచ్చని పోలీసు శాఖ వర్గాల ద్వారా తెలిసింది. కార్మికులను రక్షించే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్