బస్సుల్లో ఛార్జీలు పెంచలేదు.. RTC ప్రకటన

4933చూసినవారు
బస్సుల్లో ఛార్జీలు పెంచలేదు.. RTC ప్రకటన
తెలంగాణ బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని TGSRTC ఛైర్మన్ సజ్జనార్ ప్రకటించారు. 'హైవేలపై కేంద్రం ఇటీవల టోల్ ఛార్జీలను పెంచడంతో టికెట్లో టోల్ సెసు సవరించాం. ఈ నెల 3వ తేదీ నుంచి టోల్ ప్లాజాలున్న రూట్లలోనే ఇవి అమల్లోకి వచ్చాయి. సాధారణ రూట్లలో ఛార్జీల్లో మార్పు చేయలేదు. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్