జమ్ము కశ్మీర్లోని రియాసీలో యాత్రికులే లక్ష్యంగా బస్పై ఉగ్ర దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. . ఈ ఘటనలో బస్ డ్రైవర్ సహా 9 మంది యాత్రికులు మరణించడంతో పాటు 33 మంది మరణించారు. ఉగ్ర దాడిని జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్రంగా ఖండించారు. ప్రజల ఆందోళనను తాను అర్ధం చేసుకోగలనని, మనమంతా భద్రతా దళాలు, జమ్ము కశ్మీర్ పోలీసుల పట్ల విశ్వాసం కలిగిఉండాలని సూచించారు.