ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం

74చూసినవారు
ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం
ఏపీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం నుంచి బుచ్చయ్య చౌదరి ఎన్నికైన విషయం తెలిసిందే. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సీనియర్‌ ఎమ్మెల్యే కావడంతో ఆయనే ప్రొటెం స్పీకర్‌గా ఎంపికయ్యారు.

సంబంధిత పోస్ట్