ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా కుప్పంకు చంద్రబాబు వెళ్లనున్నారు. రెండు రోజులపాటు ఆయన కుప్పంలోనే ఉండనున్నారు. సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.