భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. శ్రీలంక పర్యటనలో ఉన్న మోదీకి ఆదేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే శ్రీలంక అత్యున్నత పురస్కారం ‘శ్రీలంక మిత్ర విభూషణ’ను అందజేశారు. ప్రధాని మోదీ ఈ అవార్డు పొందేందుకు అన్నివిధాలా అర్హులని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే ప్రధాని మోదీ పలు దేశాల అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు.