ఢిల్లీలోని గీతా కాలనీలో బుధవారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. జానకి కుమారి (65) అనే మహిళ ఎప్పటిలాగానే ఆ రోజు ఇంటి ముందు శుభ్రం చేస్తోంది. ఆ సమయంలో ముఖేష్ రాథోడ్ అనే యువకుడు కారును వేగంగా పోనిచ్చాడు. ఆ కారు అదుపుతప్పి జానకిని ఢీకొట్టింది. దీంతో జానకి గాల్లోకి ఎగిరి కింద పడింది. తీవ్ర గాయాలు కావడంతో స్పాట్లోనే చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.