యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బదౌన్ జిల్లా బడాయూన్లోని థానా ముజారియా ప్రాంతంలోని వాసవన్పూర్ గ్రామ సమీపంలో బైక్ను అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళుతున్న ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.