ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి కేవలం ఒక్కరికి మాత్రమే ఏపీ రాష్ట్ర కేబినెట్లో స్థానం దక్కింది. పాయకరావుపేట నుంచి టీడీపీ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనితను హోం మంత్రిగా నియమిస్తూ సీఎం చంద్రబాబు ఉత్తర్వులు జారీచేశారు. విద్యావంతురాలైన వంగలపూడి అనిత ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో ఉద్యోగానికి రాజీనామా చేసి, 2013లో తెలుగుదేశం పార్టీలో చేరి నేడు రాష్ట్ర హోం మంత్రి స్థాయి చేరుకున్నారు.