ఏపీలో రామరాజ్యం రావాలంటే జగనాసుర వధ జరగాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ పై రాయి వేస్తే గగ్గోలు పెట్టిన వైసీపీ నేతలు.. రాష్ట్రంలో జరిగిన హత్యలు, అరాచకాలు, భూ కబ్జాలపై నోరు మొదపలేదని మండిపడ్డారు. ప్రజల గెలుపు కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయన్నారు. సీట్ల విషయంలోనూ మూడు పార్టీలు తగ్గాయన్నారు.