రాజస్థాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికులు సిక్సులు సమర్పించుకున్న ప్లేయర్గా నిలిచారు. హైదరాబాద్తో శుక్రవారం జరిగిన మ్యాచులో చాహల్ రెండు సిక్సులిచ్చాడు. దీంతో ఐపీఎల్లో ఓవరాల్గా 224 సిక్సులు ఇచ్చి.. మాజీ స్పిన్నర్ పీయూష్(224) పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. కాగా క్వాలిఫైయర్-2 మ్యాచులో చాహల్ 4 ఓవర్లలో వికెట్ తీయకుండా 34 పరుగులు సమర్పించుకున్నారు.