వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. 100% స్ట్రైక్ రేట్ అనడాన్ని ఎద్దేవా చేస్తూ, గెలిచిన 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు జనసేన వాళ్లు కాదని, టీడీపీలో టికెట్ దక్కని వారే జనసేనలో చేరి గెలిచారని అన్నారు. జనసేన, టీడీపీలకు చంద్రబాబునే బాస్ అని, రెండు పార్టీలు వేరు కాదు ఒక్కటేనని ఆరోపించారు.