AP: అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త అడపా దుర్గాప్రసాద్ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ నుంచి వెళ్తూ హఠాన్మరణం చెందారు. ఈ ఘటనపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ విషయం తనకు తెలిసి చింతిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.