అమరావతి చేరుకున్న చంద్రబాబు

64చూసినవారు
అమరావతి చేరుకున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి చేరుకున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రివర్గం ప్రమాణస్వీకారం అనంతరం నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. మరోవైపు బుధవారం సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుపై కసరత్తు ముమ్మరం చేయనున్నారు. మంగళవారం నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్