పాఠశాల విద్య పాఠ్యాంశాల్లో బంగ్లాదేశ్ కీలక మార్పులు చేసింది. పాఠశాల పాఠ్యాంశాల్లో బంగబంధు ముజిబుర్ రెహమాన్, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రాలను తొలగించడం చర్చనీయాంశమైంది. అన్ని పాఠ్య పుస్తకాల్లో నుంచి మాజీ ప్రధాని షేక్ హసీనా అనే పేరును పూర్తిగా తొలగించింది. బంగ్లా స్వాతంత్య్ర ఉద్యమంలో భారత్ పాత్రను తగ్గిస్తూ కొత్త పుస్తకాల్లో మార్పులు చేసింది.