'మంచిని మైక్లో చెప్పండి.. చెడుని చెవిలో చెప్పండి' అని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ గాంధీభవన్లో ఆయన మాట్లాడారు. "మంచిని మైక్లో చెప్పాలి.. చెడుని చెవిలో చెప్పాలి అని పెద్దలు చెప్పారు. కానీ, మనోళ్లు చెడుని మైక్లో చెబుతూ.. మంచిని చెవిలో చెబుతున్నారు. దీని వల్ల పార్టీకి ఏ విధంగానూ మంచిది కాదు. ఇది పార్టీకి, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చి పెడుతుంది." అని సీఎం అన్నారు.