పూరీ జగన్నాథ ఆలయంలో కలకలం (Video)

52చూసినవారు
పూరి జగన్నాథ ఆలయంలో కలకలం చెలరేగింది. ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆలయ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయ శిఖరంపైకి చేరుకున్నాడు. దీనిని చూసినవారంతా షాకయ్యారు. ఆలయ అధికారులు అతనిని కిందకు తీసుకువచ్చారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి తాను ఒడిశాలోని ఛత్రపూర్‌నకు చెందినవాడినని తెలిపాడు. తన కోరిక నెరవేరాక, ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రాన్ని తాకి, అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్నానని పేర్కొన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్