వయనాడ్ బాధితురాలు.. శ్రుతి ప్రేమ కథలో పెను విషాదం

66చూసినవారు
వయనాడ్ బాధితురాలు.. శ్రుతి ప్రేమ కథలో పెను విషాదం
కేరళ రాష్ట్రం వయనాడ్ బాధితురాలు శ్రుతి జీవితంలో మరో పెను విషాదం చోటుచేసుకుంది. ఆమె ప్రియుడు జాన్సన్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన నడుపుతున్న ఓమ్నీ వ్యాన్ ను బస్ ఢీకొట్టడంతో జాన్సన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో శ్రుతికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా గత నెలలో వయనాడ్ లో సంభవించిన వరదల్లో ఆమె తండ్రి, తల్లి, చెల్లితో పాటు మరో ఆరుగురు బంధువులు మరణించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్