సూడాన్ లో కలరా విజృంభిస్తుంది. గత కొన్ని వారాల్లో కలరా వల్ల సుమారు 22మంది మృతి చెందారని, వందలాది మంది అస్వస్థతకు గురైనట్లు ఆరోగ్య అధికారులు ఆదివారం తెలిపారు. ఇటీవల సంభవించిన వినాశకరమైన వరదలతో సుడాన్ అతలాకుతలమైంది. దీంతో 354 మంది కలరా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రి హైతం మొహమ్మద్ ఇబ్రహీం ఒక ప్రకటనలో తెలిపారు. కలరా కేసులపై WHO స్పందించింది. ఈ ఏడాదిలో జూలై 28 నాటికి సూడాన్లో కలరా కారణంగా 78 మరణాలు నమోదయ్యాయని పేర్కొంది.