AP: మాజీ సీఎం జగన్కు భారీ షాక్ తగలనుంది. మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో మద్యం పాలసీ, అమ్మకాలపై సీఐడీ విచారణ జరుగుతుందన్నారు. సిట్ వేసిన సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్లో ఫైళ్లు తగలబెట్టారని ఆరోపించారు. లిక్కర్, ఇసుక, మైన్స్ దోపిడీ చేసిన వాళ్లను వదిలిపెట్టమన్నారు. కాగా, గతేడాది వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంపై సీఐడి దర్యాప్తుకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.