కేంద్ర దర్యాప్తు సంస్థలపై సీజేఐ కీలక వ్యాఖ్యలు

81చూసినవారు
కేంద్ర దర్యాప్తు సంస్థలపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
దేశంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలపై భారత ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విస్తరణ జరగాల్సినంతగా జరగలేదని.. ఫలితంగా అవి జాతీయ భద్రత, దేశ వ్యతిరేక నేరాలతో ముడిపడిన కేసులకే ప్రయారిటీ ఇచ్చి, వాటికే పరిమితం కావాల్సి వస్తోందన్నారు. క్లిష్టమైన కేసులను ఛేదించడానికి దర్యాప్తు సంస్థలు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్