ఎన్నికల వేళ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దుర్గాపూర్, బీరూమాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, తమ ఏజెంట్లను పోలింగ్ స్టేషన్ లోపలికి రానివ్వట్లేదని ఇరు పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. మరోవైపు పూర్వ బర్ధమాన్ జిల్లాలో ఆదివారం రాత్రి మింటు షేక్ అనే TMC కార్యకర్తపై బాంబు దాడి జరగగా అతను ప్రాణాలు కోల్పోయాడు.