ఏపీ సీఎం చంద్రబాబు మార్చి 5వ తేదీ నుంచి వరుసగా 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ, అమిత్షాలతో చంద్రబాబు కీలక భేటీలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి, రాష్ట్ర అవసరాలపై వారితో కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు 6వ తేదీ ఉదయం విశాఖకు వచ్చి మళ్ళీ రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. సీఎం తిరిగి 7వ తేదీన అమరావతి రానున్నట్లు తెలుస్తోంది.