ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభివర్ణించారు. ‘నా మద్దతు, సంఘీభావాన్ని తెలియజేయడానికి వ్యక్తిగతంగా సునీతా కేజ్రీవాల్తో మాట్లాడాను. ఎన్నికైన ప్రతిపక్ష ముఖ్యమంత్రులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని అరెస్ట్ చేయడం దారుణం. బీజేపీతో కలిస్తే మాత్రం సీబీఐ, ఈడీల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఏం చేయరు’ అని ఎక్స్లో పేర్కొన్నారు.