జిల్లాల కుదింపుపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

61చూసినవారు
జిల్లాల కుదింపుపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ
తెలంగాణలో జిల్లాల సంఖ్యను కుదింపుపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తానెప్పుడూ జిల్లాలను కుదిస్తానని చెప్పలేదని, వాటిని హేతుబద్ధీకరించేందుకు మాజీ జడ్జి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని మాత్రమే చెప్పినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో జనాభా పరంగా భారీ తేడా ఉందని, అందుకే వాటిని హేతుబద్ధీకరించాలని తెలిపారు. కమిషన్ ఏర్పాటుకు బడ్జెట్ సమావేశాల్లో అందరి అభిప్రాయం తీసుకుంటామని ఢిల్లీలో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్