ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇప్పించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాహుల్ గాంధీని కలిసి పార్లమెంట్లో ఈ విషయాన్ని లేవనెత్తాలని కోరుతామని అన్నారు. ఈ బాధ్యతను కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్కు అప్పగిస్తానని చెప్పారు. సోమవారం నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.