మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికపై శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. వర్షాకాలంలో బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ఎన్ఢీఎస్ఏ చేసిన సిఫార్సులు, ఇప్పటి వరకు నీటి పారుదల శాఖ తీసుకున్న చర్యలు, వర్షాకాలంలోగా చేయాల్సిన పనులపై సమీక్షించనున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖకు సమాచారం అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.