గ్రేటర్ వరంగల్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష చేపట్టారు. హనుమకొండ కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం భేటీ అయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ, స్మార్ట్ సిటీ పథకంపై అధికారులకు సూచనలు చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై తగు సూచనలు చేశారు.