21 కిలోమీటర్లు పరిగెత్తిన సీఎం (వీడియో)

56చూసినవారు
జమ్మూకశ్మీర్‌‌ ముఖ్యమంత్రిగా ఇటీవల పగ్గాలు చేపట్టిన ఒమర్‌ అబ్దుల్లా ఆదివారం తొలి మారథాన్‌ను నిర్వహించారు. జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. మారథాన్‌లో పాల్గొన్నారు. రెండు గంటల్లోనే 21 కిలోమీటర్లు పరిగెత్తారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 13 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 2 వేల మంది అథ్లెట్లు.. స్థానికంగా 35 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్