AP: విద్యార్థులకు కొత్త యూనిఫామ్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం (జూన్ 12) నుంచి స్కూల్ యూనిఫామ్లు మారనున్నాయి. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన యూనిఫామ్లకు ఆమోదం తెలిపింది. ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా యూనిఫామ్లు రూపొందించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లో భాగంగా స్టూడెంట్లకు యూనిఫామ్, బ్యాగు, బెల్ట్ అందించనున్నారు.