1930 ఏప్రిల్లో మహాత్మాగాంధీ పిలుపుతో సుందరయ్య చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్య్ర ఉద్యమంలో చేరి 17 ఏళ్ల వయసులోనే అరెస్ట్ అయ్యారు. మైనారిటీ తీరకపోవడంతో ఆయన్ను రాజమండ్రిలోని బోస్టన్ స్కూల్కు తరలించారు. అక్కడ కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వస్తూనే భూస్వాములపై తిరుగుబాటు చేశారు. సామాన్య కార్యకర్తగా కమ్యూనిస్టు పార్టీలోకి అడుగుపెట్టిన ఆయన అదే పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యారు.