'కాంగ్రెస్,
బీజేపీ కక్ష.. బీఆర్ఎస్సే తెలంగాణకు రక్ష' అని ప్రతిపక్ష బీఆర్ఎస్ తన ట్విట్టర్ లో పేర్కొంది. '
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకే నాణానికి బొమ్మా బొరుసు లాంటివి. వారి నినాదాలు మాత్రమే వేరు, విధానాలు ఒకటే. జెండాలు మాత్రమే వేరు, ఎజెండా ఒకటే. బలహీనమైన రాష్ట్రాలు, బలమైన కేంద్రమే ఈ రెండు పార్టీల విధానం. రాష్ట్రాల హక్కులను కాలరాయడంలో రెండింటిదీ ఒకే దారి.' అని ట్వీట్ చేసింది.