అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా రామనామం మార్మోగింది. భక్తులందరూ ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న మీరా రోడ్లో ఓ యువకుడు తుపాకీ చేత పట్టుకుని ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. బైక్పై నిలబడి ఓ చేతిలో రాడ్డు, మరో చేతిలో తుపాకీ పట్టుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.