లోక్సభ ఎన్నికల వేళ పంజాబ్ కాంగ్రెస్లో అనూహ్య పరిణామం జరిగింది. మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీని జలంధర్ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీనిని పార్టీ ఎమ్మెల్యే విక్రమ్జిత్ సింగ్ వ్యతిరేకించారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పుడతున్నారనే కారణంతో ఆయనను కాంగ్రెస్ బుధవారం సస్పెండ్ చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దేవేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.